హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): పాస్పోర్ట్ దరఖాస్తుల ప రిశీలన, పోలీసు ధ్రువీకరణ ప్రక్రియ లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2025-26 సంవత్సరంలో పాస్పోర్ట్ దరఖాస్తుల ధ్రువీకరణలో విశిష్ట సేవ లు అందించిన రాష్ట్ర పోలీసుగా తెలంగాణ పోలీస్ శాఖను ఎంపిక చేస్తూ ‘ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ను విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేర కు ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అండ్ చీఫ్ పాస్పోర్ట్ ఆఫీసర్ బీఎస్ ముబారక్ డీజీపీ సీవీ ఆనంద్కు లేఖ పంపా రు. ఈ ఏడాది పాస్పోర్ట్ సేవా దివస్, పాస్పోర్ట్ అధికారుల సదస్సు ఈనెల 18, 19 తేదీల్లో ఢిల్లీలోని జవహర్ లా ల్ నెహ్రూ భవన్లో నిర్వహించనున్నారు.
19న జరిగే కార్యక్రమంలో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ చేతు ల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ అ వార్డు అందుకోనున్నారు. పాస్పోర్ట్ జారీ ప్రక్రియలో పోలీసు ధ్రువీకరణ కీలకమైన అంశమని, ఈ విభాగంలో తెలంగాణ పోలీసులు వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఈ గుర్తింపు దకిందని డీజీపీ పేరొన్నా రు. కాగా పాస్పోర్ట్ సేవా దివస్లో భాగంగా నిర్వహించే హై-లెవల్ సెగ్మెంట్ కార్యక్రమానికి డీజీపీని విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది.