హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్తో వచ్చేనెల 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని అఖిల భారత దివ్యాంగుల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరావు వెల్లడించారు.
మంగళవారం హైదరాబాద్లో అఖిల భారత వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ప్రతి దివ్యాంగుడికి ప్రత్యేక జీవిత బీమా పథకాన్ని వర్తింపజేయాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్న డిమాండ్లతో ఆగస్టు 2వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివరాత్రి రాజయ్య, మహంకాళి రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.