హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మతోన్మాదానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి మనుగడ ఉంటుందని, ఈ పరిణామం స్వాగతించదగినదేనని సీపీఎం సీనియర్ నేత మధు తెలిపారు. శుక్రవారం ఏపీలోని విజయవాడలో జరిగిన జాతీయ సెమినార్ సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. జాతీయ పార్టీని కేసీఆర్తోపాటు ఎవరైనా పెట్టొచ్చని చెప్పారు. జాతీయస్థాయిలో ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకొనే కంటే, ఎన్నికలయ్యాక ఒకే వేదిక మీదకు వస్తే మంచిదనేది లెఫ్ట్పార్టీ భావనని పేర్కొన్నారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పని చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ కేంద్రం ఒత్తిళ్లకు లొంగుతున్నారన్నారు.