హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డిలోని టీఆర్ ఆర్ వైద్య కళాశాలలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
ఎన్ఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎన్ఎంసీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీకి కళాశాల దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ పరిష్కారమయ్యేంత వరకు అడ్మిషన్ల రద్దు ఉత్తర్వులను అమలు చేయరాదని ప్రకటించింది. సత్వరమే కాలేజీ అప్పీల్ను పరిషరించాలని ఎన్ఎంసీ కమిటీని హైకోర్టు ఆదేశించింది.