హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్పై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ అన్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్ఈయూ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాత పెన్షన్ సాధన సాకార సభ లో ఆయన మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరిస్తే బీఆర్ఎస్కు మద్దతిస్తామని ప్రకటించారు.