నిర్మల్ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురవేయాలని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలిజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలనని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దిసప్తాహ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా గండిరామన్న హరితవనం ఫ్రీడం పార్క్ లో విద్యార్థులు, పట్టణవాసులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఎందరో మహనీయుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇవాళ 75 వేల మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టరు హేమంత్ బొర్కడే,
జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్ల వెంకట్రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.