‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్రంలోని పాలనావ్యవస్థ ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హకులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధమవుతున్నారో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిషారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాల్సిన సందర్భమిది’
– సీఎం కేసీఆర్
దేశంలో ఎకడైనా రాజకీయ నాయకులు రైతుల విషయంలో 5, 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారు. కానీ రోజులపాటు సమయం కేటాయించి, వారి సమస్యల పరిషారం దిశగా చర్చలు జరిపింది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఇంతటి విస్తృతస్థాయి రైతు సమావేశం దేశంలోనే మొదటిసారి చూస్తున్నాం’
-జాతీయ రైతు సంఘాల ప్రతినిధులు
ఈ అంధకారం నుంచి దేశాన్ని బయటకు తీసుకు రావాలంటే ప్రజాసంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుంది. ప్రారంభదశలో మనతో కలిసివచ్చే వ్యక్తులు అనుమానాలు, అపోహలకు గురవుతుంటారు. ఆ అడ్డంకులన్నీ, దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
-రైతు సంఘాల నేతలతో సీఎం కేసీఆర్
ఈయన పేరు బల్బీర్సింగ్ రాజేవాల్. పంజాబ్కు చెందిన ఈ రైతు నాయకుడి వయసు 79 ఏండ్లు. గడిచిన 52 ఏండ్లుగా ఆయన రైతుల కోసం ‘ఆందోళన్’ చేస్తూనే ఉన్నారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యిందీ లేదు. ఆందోళన ఆగిందీ లేదు. ఇలా ఇంకెన్ని తరాలు పోరాటంలోనే గడిచిపోవాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ప్రశ్న అడిగారు. అనైక్యతతో, తమకోసం ఎవరో ఏదో చేస్తారని చూసి దరఖాస్తులు, మహజర్లు ఇచ్చే స్థితిలో రైతులు ఇంకెన్ని రోజులు ఉండాలని అన్నారు. అభ్యర్థించే స్థితి నుంచి దేశాన్ని శాసించే స్థితికి ఈ దేశ రైతు ఎదగాలని, అప్పుడే అసలైన ‘జై కిసాన్’ అని కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి, ఇక్కడ అమలవుతున్న రైతు సంక్షేమ విధానాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూసేందుకు జాతీయ రైతు ఐక్య వేదిక ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన శనివారం జరిగిన జాతీయ రైతుసంఘాల ప్రతినిధుల సమావేశం ముక్తకంఠంతో తీర్మానించింది. ప్రగతిభవన్లో వివిధ రాష్ర్టాల రైతు ప్రతినిధులు, జాతీయ రైతుసంఘాల నాయకులు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. దేశ రైతాంగ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చిన ఇటీవలి కిసాన్ ఆందోళనలో పాల్గొన్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సమావేశంలో ఉద్వేగంగా మాట్లాడారు. తెలంగాణ వ్యవసాయ విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. దేశ వ్యవసాయరంగానికి తెలంగాణ మాడల్ అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
దేశంలో సరికొత్త రైతు ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరమున్నదని వారు స్పష్టంచేశారు. పంటలు పండించడంతోపాటు, గిట్టుబాటు ధరలను కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా ఖండించారు. దేశంలో రైతాంగం సంఘటితం కావాల్సిన సమయం వచ్చిందని, అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఆయన నాయకత్వం దేశానికి అవసరమని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రెండోరోజూ కొనసాగింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రగతిభవన్కు చేరుకున్న రైతు సంఘాల నేతలు అల్పాహారం అనంతరం వ్యవసాయం, సాగునీరు తదితర రంగాల్లో తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. డాక్యుమెంటరీని చూస్తున్నంతసేపూ హర్షధ్వానాలు వ్యక్తంచేశారు. తమ క్షేత్రస్థాయి పరిశీలనకు, డాక్యుమెంటరీలోని దృశ్యాలు, వివరణలు అద్దం పడుతున్నాయని రైతు నేతలు తెలిపారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి రైతు సంక్షేమ పథకాలు ఉంటే తాము కూడా ఎంతో అభివృద్ధి చెందేవారమని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత వారంతా కలిసి ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు.
26 రాష్ర్టాల ప్రతినిధుల భాగస్వామ్యంతో ఇంత సుదీర్ఘంగా ఒక రైతు నేతల సమావేశం జరుగడం దేశంలో ఇదే మొదటిసారి. ఇంతటి విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరై సుదీర్ఘంగా చర్చించడంపై రైతుసంఘాల ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. ‘దేశంలో ఎకడైనా రాజకీయ నాయకులు రైతుల విషయంలో 5, 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారు. కానీ రోజులపాటు సమయం కేటాయించి, వారి సమస్యల పరిషారం దిశగా చర్చలు జరిపింది మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఇంతటి విస్తృతస్థాయి రైతు సమావేశం దేశంలోనే మొదటిసారి చూస్తున్నాం’ అని సమావేశంలో పాల్గొన్న జాతీయ రైతుసంఘాల నేతలు, వివిధ రాష్ర్టాల రైతు ప్రతినిధులు సంతోషం వ్యక్తంచేశారు. ప్రకృతి వనరులు, సాగు యోగ్యమైన భూములు తదితర అన్ని సౌకర్యాలున్నా, వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడంలో 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ నాయకత్వం, పాలకుల వైఫల్యంపై సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగింది. తెలంగాణలో వ్యవసాయంతోపాటు సాగునీరు, తాగునీరు, 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, పంటకల్లాల నిర్మాణం, కరోనా కష్టకాలంలో సైతం పంటల కొనుగోళ్లు, వ్యవసాయ అనుబంధరంగాలు, పాడిపంట, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, విద్య, వైద్యరంగాలకు సంబంధించి అభివృద్ధి పథకాల వివరాలను రైతు సంఘాల నేతలు కేసీఆర్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ అంధకారం నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాలంటే, ప్రజాసంక్షేమం కోరుకునే శక్తులు సంఘర్షించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రారంభదశలో మనతో కలిసివచ్చే వ్యక్తులు అనుమానాలు, అపోహలకు గురవుతుంటారని, ఆ అడ్డంకులన్నీ, దాటుకొంటూ ఐక్యత సాధించి లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుందని సీఎం వివరించారు. ‘అమెరికా, చైనా వంటి మిగతా దేశాలతో పోల్చిచూస్తే.. నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూమి, మానవ వనరులు భారతదేశంలోనే పుషలం. మొత్తం 40 వేల కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమి దేశంలో ఉన్నది. ఈ భూముల సాగుకు కావల్సింది 40వేల టీఎంసీల నీళ్లు మాత్రమే. తాగునీటికి 10 వేల టీఎంసీలైతే సరిపోతయి. మరి, 70 వేల టీఎంసీల నీటి వనరులు మన దేశంలో అందుబాటులో ఉన్నా.. ఎందుకు సాగునీటికి, తాగునీటికి ప్రజలు ఎదురు చూడాల్సి వస్తున్నది. అదే సందర్భంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకొనే సామర్థ్యం మన దేశానికి ఉన్నది. అయినా, 2 లక్షల మెగావాట్ల విద్యుత్తును కూడా వినియోగించుకోలేకపోతున్నం. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం రైతులందరికీ ఉచితంగా విద్యుత్తును, సాగునీటిని అందిస్తున్నప్పుడు ఇదేపనిని కేంద్రం దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయదు? రైతులు కూర్చొని మాట్లాడుకోవడానికి తెలంగాణలో ఉన్నట్టు దేశంలో ఎకడైనా కిసాన్ మంచ్లు ఉన్నాయా? సాగునీరున్నది.
కరంటు ఉన్నది. కష్టపడే రైతులున్నరు. అయినా ఈ దేశంలో వ్యవసాయరంగం ఎందుకు సంక్షోభంలో కూరుకుపోయింది? రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయి? కేంద్ర పాలకులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విషయాలను మనం విశ్లేషించుకొని, చర్చించాల్సిన సందర్భమిది. మనదేశ వనరులను సరిగా వినియోగించుకుంటూ దేశ సౌభాగ్యాన్ని గుణాత్మకంగా అభివృద్ధి పరిచే రైతు వ్యవసాయ సంక్షేమం దిశగా సాగే సుపరిపాలన కోసం అడుగులు వేయాల్సి ఉన్నది. దేశంలోని రైతాంగం అంతా వ్యవసాయ రంగాన్ని గుణాత్మకంగా ప్రగతిపథాన నడిపించేందుకు ఐక్య సంఘటనగా జట్టుకట్టాల్సి ఉన్నది. అందుకు దేశవ్యాప్తంగా రైతాంగ పోరాటాలు చేస్తున్న మీరంతా ముందు వరసలో ఉండాల్సిన అవసరం ఉన్నది’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బాల సుమన్, ఆశన్నగారి జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సహా ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర రాష్ట్రాలకు చెందిన, వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్న పలువురు సీనియర్ రైతు సంఘాల నేతలు సహా దాదాపు 100 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ఆదివారం కూడా కొనసాగనున్నది. ఈ సందర్భంగా మరిన్ని వ్యవసాయ సమస్యలు, పరిషారమార్గాలపైన సీఎం కేసీఆర్ గారితో రైతు సంఘాల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు.
పరిణామ క్రమంలో పాలన పరిపూర్ణతను సాధించిన చోట ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. జాతీయ రైతుసంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం కేసీఆర్.. ఒక రైతుగా తన అనుభవాలనూ వారితో పంచుకున్నారు. ‘చైతన్యంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంది. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తమ దేశాల చట్టాలను, పాలనావ్యవస్థలను రూపొందించుకొంటుంది. ప్రజలకు దీర్ఘకాలిక అవసరాల ప్రాతిపదికన సర్వానుమతితో పాలనను ప్రారంభిస్తారు. తొలిదశలో పరిపాలన సంపూర్ణంగా ఉండకపోవచ్చు. బాలారిష్టాలను దాటుకుంటూ అనుభవాలను, కార్యాచరణను క్రోడీకరించుకోవడం ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో పాలన 80% వరకు విజయవంతంగా గాడిలో పడుతుంది. తద్వారా ఆ దేశ ప్రజల జీవితాలు గుణాత్మకంగా అభివృద్ధిని సాధిస్తాయి. మిగిలిన కొద్దిశాతం పాలన కూడా మరికొద్దికాలంలో చకబడి, పరిపూర్ణత సాధించుకుంటుంది. ప్రపంచంలో సైన్సు, సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ ఆయా సమాజాల్లో నూతన ఆవిషరణలు చోటుచేసుకుంటాయి. అలా సాంకేతికత పెరుగుతున్నకొద్దీ.. పాలనలో పరిపూర్ణత వస్తుంది. మానవ జీవితం ఉన్నంతకాలం ఈ పరిణామ క్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది’ అని కేసీఆర్ వివరించారు.
‘మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిన తర్వాత కూడా కేంద్రంలోని పాలనావ్యవస్థ ఇంకా గాడిలో పడకుండా, ప్రజల ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకుండా పోవడానికి గల కారణాలను మనం అన్వేషించాలి. స్వాతంత్య్ర పోరాటం ముగిసిన దశాబ్దాల తర్వాత కూడా దేశంలో అనేక వర్గాలు తమ ఆకాంక్షలను, హకులను నెరవేర్చుకునేందుకు ఇంకా పోరాటాలకు ఎందుకు సిద్ధమవుతున్నారో మనందరం ఆలోచించాల్సి ఉంది. ముఖ్యంగా రైతు సమస్యలకు ఇంకా ఎందుకు పరిషారం దొరకడం లేదో, ఈ దేశ పాలకులు ఎందుకు వైఫల్యం చెందుతున్నారో చర్చించుకోవాల్సిన సందర్భమిది’ అని సీఎం కేసీఆర్ అన్నారు. చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్లు నిర్లక్ష్యం వహిస్తుండటం, ప్రజలకోసం పనిచేసే వాళ్లను దేశ పాలకులే ఇబ్బందులకు గురిచేయటం అనేవి ఈ దేశంలో కొనసాగుతుండటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఉత్తర, దక్షిణ భారతంతో సహా ఈశాన్య రాష్ట్రాల వ్యవసాయం, రైతు సంక్షేమంపై సీఎం కేసీఆర్ రైతులతో చర్చించారు. వారు ఎదురొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక, అసంబద్ధ విధానాల వల్ల జరుగుతున్న నష్టాలపై కేసీఆర్కు వారు వివరించారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక నైసర్గిక స్వరూపాలను, వాతావరణ పరిస్థితులను అనుసరించి పండే పంటలు, ప్రజల అవసరాలను తీర్చే పంటలు, రైతులకు మరింత లాభాలు తెచ్చిపెట్టే దిశగా, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అంశంపై వారు సీఎం కేసీఆర్ సహకారాన్ని అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా తమకూ సహకారం దొరికితే ఇక్కడి రైతుల్లా తామూ సంపన్నులం అవుతామని వారంతా ధీమా వ్యక్తంచేశారు.