యాదాద్రి భువనగిరి : కుక్కలదాడిలో జాతీయ పక్షి నెమలి(Peacock death) మృత్యువాత పడింది. ఈ సంఘటన యాదగిరిగుట్ట(Yadagirigutta) ఆలయం కొండ కింద గల బస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బుధవారం ఉదయం బస్ స్టేషన్ పరిసరాల్లో నెమలి సంచరిస్తున్న సమయంలో ఈఘటన జరిగింది.
స్థానికుడు గుజ్జ భాస్కర్ ఫారెస్ట్ అధికారులు సమాచారం ఇచ్చి నెమలిని అప్పగించారు. నెమలికి పంచనామా జరిపి ఖనణం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కాగా, కొండ కింద ఆలయం, నూతన బస్ స్టాప్ వద్ద ఆహారం కోసం నెమలి కిందికి వచ్చినట్లు తెలుస్తున్నది. గాయపడిన నెమలిని చూసి స్థానికులు గుర్తించే లోగా మృత్యువాత పడింది.