నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 18: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. 1945 జనవరి 17న నిర్మల్లో జన్మించిన భద్రయ్య ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాహిత్య కళావైభవాలను తెలుపుతూ అనేక సంకలనాలను వెలువరించారు. నా కర్తవ్యం, ‘మన ఆదిలాబాద్-మన భాష-మన బాస’ పేరుతో తెలంగాణ పదాలపై నిఘంటువును అందించారు. పద్య, వచన కవిగా, వక్తగా, పాటల రచయిత గా జాతీయస్థాయిలో గుర్తింపును పొం దారు. ప్రత్యూష అనే సాహిత్య పత్రికను నడిపారు. భద్రయ్య మృతిపట్ల సాహితీ ప్రేమికులు, కవులు, రచయితలు సంతాపం తెలిపారు.