న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కేంద్రంలోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించే పరీక్షల క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను చార్ట్లో పొందుపరిచింది. ఆ ఏడాది జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి 25న పరీక్ష నిర్వహిస్తారు.
అదే ఏడాది ఆగస్టు 22 నుంచి ఐదు రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. అలాగే సీబీఐ (డీఎస్పీ), ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ), సీఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, సీడీఎస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక షెడ్యూల్ను ఆ చార్ట్లో వివరించింది.