హైదరాబాద్, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ): స్థానికసంస్థల్లో కొత్త రిజర్వేషన్లను అమలు చేయాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అమలులో ఉన్న 23 శాతం బీసీ రిజర్వుషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లోనే ఉప కులాలవారీగా వర్గీకరణతో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆ తరువాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.