హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన బృహత్ భవనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గుర్తింపు సాధించింది. ఈ మేరకు సచివాలయ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ సంస్థకు నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ‘సేఫ్టీ అవార్డు-2023’ ప్రకటించింది.
శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేసింది. ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ గణపతిరెడ్డి, నిర్మాణ సంస్థ రీజినల్ హెడ్ లక్ష్మణ్ అగర్వాల్ ఈ వార్డును అందుకున్నారు. నిరుడు ఎలాంటి ప్రమాదాలు జరగని, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన మెగా ప్రాజెక్టుగా సచివాలయం గుర్తింపు సాధించింది.