హైదరాబాద్ : ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్లె, పట్నం దద్దరిల్లింది.
సరిగ్గా 11.30 గంటలకు రాష్ట్రంలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు అంగన్వాడీ తదితర సెంటర్లో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు.
కాగా, హైదరాబాద్లోని అబిడ్స్ జీపీఎస్ సర్కిల్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరై జనగణమన ఆలపించారు. సీఎం వెంట మంత్రులు, తదితరులు ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో..
ములుగు జిల్లాలో..
నారాయణపేట జిల్లా కేంద్రంలో..
ఆదిలాబాద్ జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో..
వరంగల్ జిల్లాలో..
నాగర్కర్నూల్ జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో..
నల్లగొండ జిల్లాలో..
జయశంకర్ జిల్లాలో..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో
మహబూబ్నగర్ జిల్లాలో..