హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చేనేత, టెక్స్టైల్ రంగానికి తీరని ద్రోహం చేస్తున్న భారతీయ జనతాపార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో నేతన్నలు బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. సోమవారం మునుగోడు నియోజకవర్గంలోని నేతన్నలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. నేతన్నల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న నష్టాలను తెలియజేశారు. స్వరాష్ట్రంలో నేతన్నలకు కొత్త గుర్తింపు, గౌరవం లభించిందని, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏడాదికి రూ.1,200 కోట్ల భారీ నిధులను బడ్జెట్లో కేటాయిస్తున్నామన్నారు. యార్న్ సబ్సిడీ, చేనేతమిత్ర ద్వారా సాయాన్ని అందిస్తున్నామని, ‘నేతన్నకు చేయూత’ ద్వారా చేనేత కార్మికుల పొదుపు మొత్తానికి రెట్టింపుగా ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. ఈ పథకం ద్వారా కొవిడ్ సంక్షోభ కాలంలో రూ.100 కోట్లను రాష్ట్రంలోని నేతన్నలకు కాలపరిమితి కన్నా ముందుగానే అందించామని గుర్తుచేశారు. రైతు బీమా మాదిరే నేతన్నలకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.లక్ష వరకు చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయడం ద్వారా 10,500 మందికి లబ్ధి కలిగిందని తెలిపారు. నారాయణపేటలో సమీకృత చేనేత అభివృద్ధి కేంద్రంతోపాటు గద్వాలలో చేనేత పారును ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
చేనేతకు కేంద్రం మొండి చేయి
రాష్ట్ర ప్రభుత్వం చేనేతల కోసం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా కేంద్రం నుంచి కొంత సహాయం అడిగితే మోదీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నేషనల్ టెక్స్టైల్ రిసెర్చ్ ఇన్స్ట్టిట్యూట్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదని తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ, బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పా టువంటి విషయాల్లోనూ నిరాశే ఎదురైందన్నా రు. నేత కార్మికుల జీవితాలను చీకట్లలోకి నెడుతున్న మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి మునుగోడు ఉప ఎన్నిక ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెం, పుట్టపాక, గట్టుప్పల్, చండూరు, మునుగోడు, నారాయణపురం, లింగోటం వంటి కేంద్రాల్లో ఉన్న నేతన్నల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం, కుంట్లగూడెం ప్రాంతాలకు చెందిన స్థానిక సమస్యల పరిషారానికి కేటీఆర్ హామీ ఇచ్చా రు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలు మరింత బలంగా కొనసాగాలంటే తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని, నేతన్నల భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మా రుస్తున్న భారతీయ జనతా పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
నేతన్నలపై కేంద్రం కక్ష
తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే.. కేంద్రం మాత్రం నేతన్నలపై కక్ష కట్టిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చరిత్రలో ఏ ప్రధాని కూడా చేనేత వస్ర్తాలపై పన్ను వేయలేదని.. మోదీ మాత్రం జీఎస్టీ వేశారని మండిపడ్డారు. ప్రస్తుతమున్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచే కుట్రలను సైతం చేస్తున్నదని ఆరోపించారు. స్వదేశీ మంత్రంతో అధికారంలోకి వచ్చిన మోదీ.. వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న నేత రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేసున్నారని ధ్వజమెత్తారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్, చేనేతల పొదుపు పథకం, చేనేతలకు ఉన్న బీమా పథకం, చేనేతల హౌస్ కం వర్ షెడ్ వంటి అన్ని కీలకమైన సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి చేనేతల పట్ల మోదీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తున్నదని చెప్పారు. గతంలో ఇచ్చే యార్న్ సబ్సిడీలను 40 నుంచి 15%కి తగ్గించి చేనేత వస్త్రాల ఉత్పత్తిపై చావు దెబ్బ కొట్టిందన్నారు.