హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు. సీఎం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానికి వివరించారు.
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చికుకున్నారని, వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టామని తెలియజేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపిస్తామని, పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.