నాంపల్లి కోర్టులు, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ను ట్యాపరింగ్ చేసి నామినేషన్ దాఖలు చేశారన్న కేసులో సాక్ష్యాధారాలు సరిపోవడం లేదంటూ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు పోలీసులు తుది నివేదిక సమర్పించారు. మంత్రికి వ్యతిరేకంగా రాఘవేంద్రరాజు దాఖలు చేసిన పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని జడ్జి జయకుమార్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మహబుబ్నగర్ 2 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. మంత్రితోపాటు పదిమంది అధికారులపై నమోదైన ఎఫ్ఐఆర్లో సాక్ష్యాధారాలు సరిపోలేదని పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నామినేషన్తోపాటు మంత్రి దాఖలు చేసిన అవిడవిట్లో ట్యాంపరింగ్ చేసినట్టు ఆరోపించిన పిటిషనర్ సాక్ష్యాలను రుజువు చేసేందుకు అవసరమైన ప్రతులను సమర్పించలేదని నివేదికలో తెలిపారు.