కరీంనగర్ : తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్కరిని సమాన దృష్టితో చూసి దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును వందలకోట్లతో నిర్మించిన అత్యాధునిక సచివాలయానికి పెట్టడం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఈ చర్యతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగిందని మంత్రి గంగుల తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.