బంట్వారం, మేడ్చల్, మే 19: కరోనాతో ఇద్దరు నమస్తే తెలంగాణ జర్నలిస్టులు మృతిచెందారు. వికారాబాద్ ఆర్సీ ఇన్చార్జి, రిపోర్టర్ రవీందర్కు పది రోజుల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే చికిత్స తీసుకొన్నా, ఆరోగ్యం మెరుగుపడకపోవటంతో మూడు రోజుల క్రితం నిమ్స్లో చేరారు. అక్కడ గుండెపోటు రావటంతో బుధవారం సాయంత్రం చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మేడ్చల్ నియోజకవర్గం జవహర్నగర్ విలేకరిగా పనిచేస్తున్న సింగపాక శంకర్ (37) కూడా బుధవారం సాయంత్రమే మరణించారు. కరోనా సోకి ప్రైవేటు దవాఖానలో చేరిన ఆయన పది రోజులుగా వైరస్తో పోరాడి తుదిశ్వాస విడిచారు. శంకర్కు కూతురు(12), కుమారుడు(8) ఉన్నారు.