మిర్యాలగూడ, జూన్ 12: తెలంగాణకు తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ను ప్రైవేట్కు ధారాదత్తం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి మొదటిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్య, పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని గుర్తుచేశారు. ఇం దులో భాగంగానే నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ సుమారు రూ.30 వేల కోట్లతో మెగా థర్మల్ పవర్ ప్లాంట్ను మంజూరు చేశారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కేవలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, స్థానికంగా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక మహత్తర జీవనాధారమని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పాలకులు ఈ ప్లాంట్ను ప్రైవేట్పరం చేయడమేంటే, రాష్ట్ర సంపదను లూటీ చేయడమేనని మండిపడ్డారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో ఇకడి రైతులు, గిరిజనులు తమ పిల్లల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారని పేర్కొన్నారు. నాడు భూసేకరణలో రాష్ట్రంలో ఎకడా లేనివిధంగా నిర్వాసితులకు న్యాయం చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందని, ఇంకా 700 మందికి ఉద్యోగాలు ఇవ్వాల లని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎండీ యూసుఫ్, కుందూరు వీరకోటిరెడ్డి, రాయికింది సైదులు, సోము సైదిరెడ్డి, గుగులోత్ వీరబాబు, కొండారపు బ్రదర్స్, కందుల నాగిరెడ్డి, కొనకంచి సత్యనారాయణ, బైరం గోపి, కోటయ్య, నర్సయ్య, రమావత్ వినోద్ నాయక్, బంగారు సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.