నల్లగొండ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో జరిగే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీగా వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28, 29 జరుగన్ను డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు వాయిదా వేసినట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే టైంటేబుల్లో తెలిపిన ప్రకారం ఈ నెల 30వ తేదీన జరగాల్సిన పరీక్ష యథాతథంగా జరుగుతుందని పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్షల నిర్వహణను త్వరలో తేదీలను ప్రకటిస్తామన ఆయన తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Crime News | నల్లగొండ జిల్లాలో 120 కిలోల గంజాయి పట్టివేత
Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు
Rain Alert | తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వానలు..