హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం ఓట్లు పోలయ్యాయి. తుది పోలింగ్ శాతాన్ని మంగళవారం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఉప ఎన్నికలో మొత్తం 4,63,839 ఓట్లుండగా 3,36,013 పోలయ్యాయని తెలిపారు.
పురుషులు 73.71 శాతం, మహిళలు 70.34 శాతం ఓట్లు పోలయ్యాయి.యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 78.59%, అతి తక్కువగా ఖమ్మం జిల్లాలో 67.62 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 5న ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.