కేతేపల్లి: అభివృద్ధి నిరోధకులు పీసీసీ, బీజేపీ రాష్ర్టాధ్యక్షులు రేవంత్రెడ్డి, బండి సంజయ్లు మతిభ్రమించి సీఎం కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమ ర్శించారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు కు నోటు కేసులో, నకిలీ స్టాంపుల కుంభకోణంలో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. డ్రగ్స్ విషయంలో మంత్రి కేటీఆర్పై సవాల్ విసిరి వెనకడుగు వేసిన పిరికి వాడు రేవంత్ రెడ్డని ఎద్దేవా చేశారు.
డ్రగ్స్ కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. రేవంత్రెడ్డి తన భాష తీరు, ప్రవర్తనను మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అదేవిధంగా బండి సంజయ్ పాదయాత్రతో ప్రజలకు ఒరిగేదే మి లేదన్నారు. కేంద్రం నుంచి నిధులు తేలేని వ్యక్తి ఇక్కడ పాదయాత్ర చేయడం హాస్యాస్పదమన్నారు.
కొత్త బిచ్చగాడు పొద్దెరగని రీతిలో ప్రతిపక్ష పార్టీల నాయకులున్నారని అన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధుపై బురద జల్లేందుకు రేవంత్రెడ్డి, బండి సంజయ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న దళితుల్లో అపోహలు సృష్టించి వారిని రెచ్ట గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు.
శాంతి మార్గంలో రాష్ర్టాన్ని సాధించి పెట్టిన సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి పై నాయకులకు లేదన్నారు. మరోమారు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో పార్టీ శ్రేణులు వారిని ప్రతిఘటించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచ కొండ శ్రీనివాస్గౌడ్, గుడివాడ సర్పంచ్ కట్టా శ్రవణ్కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండలా ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్రెడ్డి, చిముట వెంకన్నయాదవ్, సర్పంచ్ల ఫోరం మండలా ధ్యక్షుడు బడుగు ల శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.