Itel S24 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్.. తాజాగా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఐటెల్ ఎస్24 ఫోన్ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, డైనమిక్ బార్, 108-మెగా పిక్సెల్ రేర్ కెమెరా యూనిట్, వర్చువల్ ర్యామ్ పెంచడానికి మెమొరీ ఫుషన్ టెక్నాలజీ ఉంటాయి.
ఐటెల్ ఎస్24 ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్ డాన్ వైట్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.999 విలువైన ఐటెల్ 42 స్మార్ట్ వాచ్ ఉచితంగా ఇస్తారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ద్వారా ఈ ఫోన్లను విక్రయిస్తారు. ఈ నెలాఖరులో రిటైల్ షాపుల్లో అందుబాటులో ఉంటాయి.
ఐటెల్ ఎస్24 ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఐటెల్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల హెచ్డీ+ (720×1612 పిక్సెల్స్) స్క్రీన్ డిస్ ప్లేతో వస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటది. మెమొరీ ఫుషన్ టెక్నాలజీతో వర్చువల్గా 16 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు.
ఐటెల్ ఎస్24 ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ తో వస్తుంది. క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు 108-మెగా పిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం6 ఐసోసెల్ సెన్సర్ విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ చార్జింగ్, ఇన్ కమింగ్ కాల్ అలర్ట్స్ వంటి డిస్ ప్లే నోటిఫికేషన్ల కోసం డైనమిక్ బార్ ఫీచర్ జత చేశారు. డ్యుయల్ డీటీఎస్ స్పీకర్లు, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 4జీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.