మల్కాజిగిరి, అక్టోబర్ 22: మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు అరాచకాలకు అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నక్క రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఓల్డ్ అల్వాల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మైనంపల్లి అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు బాధితులందరం సంఘటితం అవుతున్నామని చెప్పారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డి నిర్ణయాల వల్ల కాంగ్రెస్కు తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీ నాయకుడు నందికంటి శ్రీధర్కు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డికి మద్దతుగా త్వరలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్న పథకాల ఫలాలు అందుతున్నాయని స్పష్టంచేశారు. సమావేశంలో డోలి రమేశ్, నేమూరి శ్రీధర్గౌడ్, అభిగౌడ్, శివగౌడ్, శ్రీనివాస్గౌడ్, దేదవేందర్రెడ్డి పాల్గొన్నారు.