హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వెలుపల తొలిసారిగా సింగరేణి సంస్థ దక్కించుకున్న ప్రాజెక్ట్ నైనీ కోల్బ్లాక్. ఇందులో ఉత్పత్తి ప్రారంభించే క్రమంలో ప్రధానంగా ఆరు సవాళ్లు సింగరేణికి ప్రతిబంధకంగా మారాయి. వీలైనంత వేగంగా వీటిని పరిష్కరించుకునే దిశగా సంస్థ కసరత్తు చేస్తున్నది. నైనీ కోల్బ్లాక్కు ఇటీవల ఒడిశా సర్కారు 643 హెక్టార్ల భూమిని కేటాయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి కీలక ముందడుగు పడినట్లయ్యింది.
మరో ఆరు సమస్యలు మాత్రం అపరిష్కృతంగా ఉన్న నేపథ్యంలో ఇందుకు ఒడిశా సర్కారు సహకారమే కీలకంగా మారింది. దీంతో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ సెక్రటరీ రోనాల్డ్రోస్, సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఒడిశా సీఎం సహా ఇతర అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సవాళ్లను అధిగమించి మూడు నెలల్లోపే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
సవాళ్లు ఇవే..