ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఫిబ్రవరి 9న నిర్వహించే నాగోబా జాతరకు సంబంధించి ప్రచార రథం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మెస్రం వంశీయులు ఆదివారం ఉదయం కేస్లాపూర్కు చేరుకున్నారు. పురాతన నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ సంప్రదాయ పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని గ్రామ పొలిమేర వరకు సాగనంపారు.