Marri Janardhan Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై స్పందించారు. గతంలోనూ తమ కంపెనీల్లో ఐటీ సోదాలు చేసి, ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండు అవార్డులు కూడా ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. మళ్లీ నిన్న, ఇవాళ సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మరో అవార్డు ఇస్తారని ఆశిస్తున్నానని మర్రి జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ కంపెనీల్లో సోదాలు ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేమన్నారు. సహనాన్ని పరీక్షించేలా ఐటీ అధికారులు సోదాలు ఉన్నాయని తెలిపారు.
ఐటీ అధికారులు అడిగిన వివరాలన్నీ అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే తమ సంస్థల ఉద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. అలాంటి పద్ధతి మంచిది కాదు.. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఒకవేళ అవకతవకలు ఉంటే టాక్స్ కట్టించుకోవాలి తప్ప దౌర్జన్యం చేసే అధికారం ఐటీ అధికారులకు లేదుని మర్రి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.