మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో జరిగిన ప్రమాదంలో ఏఎస్ఐ మృతిచెందారు. జడ్చర్ల సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఏఎస్ఐ అనంతరాములు తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. అనంతరాములు నాగర్కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.