నందికొండ : గురువారం నాగార్జునసాగర్ హిల్కాలనీ పొట్టిచెలిమ సమీపంలోని ఎడమ కాల్వ ప్రారం భం వద్ద మంత్రి జగదీశ్రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి పూజలు నిర్వహించి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు. అనంతరం కృష్ణమ్మకు వాయినం సమర్పించి జలహారతి ఇచ్చారు.
జగదీశ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో మన వాటాను తీసుకోవడంలో సీఎం కేసీఆర్ నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.