హాలియా: నాగార్జునసాగర్ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. సాగర్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నోముల భగత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. హాలియాలో టీఆర్ఎస్ఎ న్నారై యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, కోశాధికారి సతీష్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం దాదాపు రెండు వారాలకుపైగా వివిధ మండలాల్లో టీఆర్ఎస్ ఎన్నారై బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గురించి విస్తృతంగా ప్రచారం చేశామన్నారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని చెప్పారు. టీఎస్ఐపాస్ వంటి పథకాలతో అంతర్జాతీయ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువస్తూ.. యువతకు ఉపాధి కల్పిస్తున్నారని వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచాలనే స్ఫూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. నిరంతరం ప్రజల సంక్షేమంకోసం పాటుపడుతున్న ఇలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉన్నదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీతోపాటు గల్లీలో కూడా లేదని, వారికి పొరపాటున ఓటు వేసినా అది వృధా అవుతుందని, ఓటరులంతా విజ్ఞతతో ఓటేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈనెల 17న జరిగే పోలింగ్లో నోముల భగత్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు పదేండ్ల నుంచి ప్రతీ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా, ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నామని, బాధ్యత గల టీఆర్ఎస్ నాయకులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని అశోక్ గౌడ్ చెప్పారు. ఇందులో భాగంగానే సాగర్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించామన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..