హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ జూపల్లి కృష్ణారావుపై పరోక్షంగా విమర్శలు చేశారు.
జూపల్లితో పెద్దగా ఒరిగేదేమీ లేదని కొట్టిపడేశారు. ఆయన పార్టీలోకి వస్తే ఏదో జరుగుతున్నదంటూ హైప్ క్రియేట్ చేశారే తప్ప.. ఇక్కడ అంత సీన్ లేదని ఎద్దేవా చేశారు. నాగర్కర్నూల్ టికెట్ తనకు కాకుం డా ఇతరులకు ఇస్తే.. సహించేది లేదంటూ అధిష్ఠానానికి పరోక్ష హెచ్చరికలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.