ధర్మపురి : తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్ నాయకులు పలువురు బుధవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన నాయకులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో చేరడంతో వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ వార్డ్ సభ్యుడు గుమ్ముల లింగన్న, ఇజ్రాయిల్ తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘ అధ్యక్షుడు సెనంగుల పోసయ్య, జైన కోసనుర్పలి గల్ఫ్ సేవ సమితి ప్రధానకార్యదర్శి బోరె రమేశ్ టీఆర్ఎస్లో చేరారు. గంగపుత్ర సంఘ అధ్యక్షులు మేడి రమేశ్, ఉపాధ్యక్షులు సముద్రాల ప్రదీప్, బోరె సాయిలు, కూనరాపు నర్సయ్య, జంబర్తి రమేశ్, సముద్రాల రాజన్న, సముద్రాల గంగారాం, సముద్రాల సతయ్య, సముద్రాల సతీశ్,సంఘ సభ్యులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ మహేశ్, సీనియర్ నాయకులు ప్రేమ్ చందర్ రావు, రమేశ్, వార్డ్ సభ్యులు దుర్గం రవీందర్ పాల్గొన్నారు.