హైదరాబాద్, మార్చి 3 : ఉద్యోగుల పరస్పర బదిలీలకోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఈ బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బదిలీలకు సంబంధించి ఇప్పటికే గత నెల 2న ఉత్తర్వులు జారీ చేశామని, అందులోని పేరా 7, 8లో పేర్కొన్న నిబంధనల్లో మార్పులు చేస్తూ మళ్లీ గత నెల 19న ఉత్తర్వులిచ్చినట్టు తెలిపారు. తద్వారా ఉమ్మడి జిల్లా క్యాడర్ ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకొంటే సీనియారిటీ కొత్త లోకల్ క్యాడర్లో కూడా ఉంటుందని స్పష్టంచేశారు. ఇప్పటివరకు పరస్పర బదిలీలకు 31 దరఖాస్తులు అందినట్టు తెలిపారు.