జమ్మికుంటలో ఏకగ్రీవ తీర్మానం
జమ్మికుంట, ఆగస్టు 27: టీఆర్ఎస్కు ముస్లిం లు జైకొట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మసీద్-ఈ-ఖాదర్ హలీమా (మహ్మదీయ) కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్యంలో నాయకులు, సభ్యులు సమావేశమయ్యారు. టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రతిని టీఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్కు అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని జాకీర్ తెలిపారు.