మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రం పరిధిలోని బేతోలు గ్రామానికి చెందిన అయ్యప్ప స్వాములకు ముస్లింలు వీడ్కోలు పలికారు.
సోమవారం స్వాములు నిర్వహించిన ఇరుముడి కార్యక్రమానికి హాజరైన ముస్లిం పెద్దలు ఆ తరువాత వారిని శబరిమలకు సాగనంపారు. కార్యక్రమంలో ముస్లింలు షేక్ యూసుఫ్, ఖాదర్ బాబా, ఫెరోజ్, జావిద్, సద్దాం, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.