బచ్చన్నపేట, అక్టోబర్ 28: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు. శనివారం పల్లా జ నగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తల్లి ఖుర్షిద్జానీ వచ్చి పల్లాను దీవించారు.
చేతికి దట్టీ కట్టి నీవు తప్పక గెలుస్తావ్ బిడ్డా.. కేసీఆర్ అందరికీ అన్నీ చేస్తుండు.. ఆయన తరఫున నువ్వు వచ్చావు మాకు సంతోషం బిడ్డా.. అంటూ ఆమె దీవెన ఇచ్చింది. అదే ఊరికి చెందిన మేకల లక్ష్మారెడ్డి రూ.100 నగదు ఇచ్చి పల్లాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.