హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్.. పాల్వాయి స్రవంతి పేరును అధికారికంగా ప్రకటించారు. 2014 సాధారణ ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి టీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెనే పాల్వాయి స్రవంతి.