మర్రిగూడ/చండూరు, సెప్టెంబర్ 16: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం చండూరులో జరిగిన కార్యక్రమంలో మర్రిగూడ మండలంలోని అజిలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 కుటుంబాలు, చండూరు మండలంలోని గుండ్రపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో అర్వపల్లి మండలం అడివెంల గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.