హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి బుధవారం నుంచే ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారినప్పటికీ.. ఎన్నికల సంఘం వద్ద ఆమోదముద్ర పడటానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నది. పార్టీ పేరును సవరించుకొనేందుకు ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951’లోని సెక్షన్ 29-ఏ అవకాశం కల్పిస్తున్నది. ఇందుకోసం కొన్ని నిబంధనలు అనుసరించాల్సి ఉంటుంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ పేరుతోనే పోటీ చేయనున్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు మాత్రమే నామిషనేషన్లను స్వీకరించనున్నారు. వచ్చే నెల 3వ తేదీన పోలింగ్ జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్గానే పోటీ చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
గుర్తు మారదు