చౌటుప్పల్: చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ రోడ్షో శుక్రవారం జరుగనున్నది. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈ రోడ్ షో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీఆర్ఎస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కొయ్యలగూడెంలో రోడ్షో ప్రారంభం కానున్నది. సాయంత్రం 4 గంటలకు రోడ్షో చౌటుప్పల్ పట్టణంలోని చిన్నకొండూరు చౌరస్తాకు చేరుకుంటుంది.
అక్కడ కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఉప ఎన్నికలో బీజేపీ చేస్తున్న కుయుక్తులను ఎండగట్టడంతోపాటు ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. ఈ రోడ్ షోలో మంత్రి జగదీశ్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొననున్నారు.