హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ అభినందనలు తెలియజేశారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయంలో కేటీఆర్ ప్రదర్శించిన రాజకీయ చతురత, అనుసరించిన వ్యూహాలు, ప్రచారంలో ప్రతి కార్యకర్తను భాగస్వామి చేసిన తీరు అభినందనీయమని దామోదర్ ప్రశంసించారు. మంగళవారం ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిసి పూల మొక్కను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ విజయానికి శ్రీరామరక్షగా నిలిచాయని దామోదర్ అన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుందని, దాంతో ఓటర్లు టిఆర్ఎస్కు పట్టంకట్టారని దామోదర్ మంత్రి కేటీఆర్తో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రేయింబవళ్ళు శ్రమించడం వల్లే టీఆర్ఎస్ అభ్యర్ధి విజయం సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తన వంతు పాత్ర షోషించిన కోలేటి దామోదర్కి మంత్రి కృతఙ్ఞతలు తెలిపారు.