Munugode By Elections Live Updates | మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ను ఆయా పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది పోలింగ్ను ప్రారంభించగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అంతకు ముందు మాక్ పోలింగ్ను నిర్వహించారు. చాలాచోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. 2.41లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,21,720 మంది పురుష, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.