Karimnagar | కరీంనగర్ : పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్నూరుకాపు సమాజానికి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనర్ మున్నూరుకాపు జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో రేవంత్ రెడ్డి దిస్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. సీనియర్ రాజకీయ నాయకులు పొన్నాల లక్ష్మయ్యపై టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పొన్నాలకు, మున్నూరుకాపు సమాజానికి రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్స్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, కర్ర రాజశేఖర్, ఏవీ రమణ, అనంతుల రమేష్, మడికంటి మారుతి, తోట కోటేశ్వర్, కొట్టే మల్లేశం, సంతోష్ పటేల్, ముప్పిడి సునీల్, పెంట శ్రీను, కొడారి శ్రీపాల్, కొత్త శ్రీధర్, బండారి సాయి తదితరులు పాల్గొన్నారు.