హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న మున్నూరుకాపు విస్తృతస్థాయి సమావేశాన్ని (ప్లీనరీ) హైదరాబాద్ లో నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. కౌన్సిల్ చైర్మన్, మున్నూరుకాపు సం ఘం గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అధ్యక్షతన మంగళవారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. రూ.1,000 కోట్ల నిధితో మున్నూరుకాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు ఆవశ్యకత గురిం చి గతంలో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని వద్దిరాజు చెప్పారు.
ఈ అంశంపై మున్నూరుకాపు ముఖ్యనేతలు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మంత్రి గంగుల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో వెళ్లి కార్పొరేషన్ ఏర్పాటుపై త్వరలో సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రోడ్లు, భవనాల సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, అపెక్స్ కౌన్సిల్ సభ్యు లు రౌతు కనకయ్య, సీ విఠల్, మున్నూరుకా పు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సుంకరి బాలకిషన్రావును రిలీవ్ చేసి ఆ యన స్థానంలో సర్దార్ పుటం పురుషోత్తంరావును నియమించారు. ప్లీనరీ నిర్వహణ కమిటీని కొండా దేవయ్య, పుటం పురుషోత్తంరావు, వెంకటేశ్వరరావు, బొంతు రామ్మోహన్, విఠల్, కనకయ్య, అనిల్తో ఏర్పాటుచేశారు.