హైదరాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థలకే సంపూర్ణ అధికారాలు ఇవ్వాలని మున్సిపల్ చాంబర్స్ అసోసియేషన్ చైర్మన్ రాజు వెన్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ హిమాయత్నగర్లోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
2019 మున్సిపల్ చట్టం వల్ల ప్రజాప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారని తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ఇచ్చిన విశేష అధికారాలను రద్దు చేయాలని, ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు.