తాడ్వాయి (ములుగు) : ఓ మహిళ సాధారణ కాన్పులో(Normal Delivery) ముగ్గురు ఆడశిశువులకు జన్మనివ్వగా ఒకరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం(PHC)లో జరిగింది.
మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని గొత్తికోయగుంపునకు చెందిన మడకం గంగమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆశా కార్యకర్త 108 వాహనంలో పీహెచ్సీకి తరలించారు. వైద్యాధికారి చిరంజీవి, స్టాఫ్నర్స్ ప్రశాంతిలు డెలివరి చేయగా గంగమ్మ ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురిలో ఒక శిశువు బరువు తక్కువగా ఉన్న కారణంగా మృతిచెందగా మిగతా ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.
తల్లి, శిశువులకు మెరుగైన చికిత్స(Treatment) కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. సాధారణ ప్రసవంలో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం అరుదైనదని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది ఆమెకు సాధారణ ప్రసవం చేయడం పట్ల డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య అభినందించారు.