Mukhra (K) | ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తమకున్న ప్రేమను ముఖరా(కే) గ్రామస్తులు చాటుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల నామినేషన్లకు ముఖరా(కే) గ్రామస్తులు తమ పెన్షన్ డబ్బులను విరాళంగా ఇచ్చారు. గ్రామంలోని పెన్షన్దారులందరూ రూ.1000 చొప్పున రూ. 1 లక్ష వరకు సేకరించి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విరాళాన్ని 100 మంది పెన్షన్దారులు ఇచ్చారు.
ఈ సందర్భంగా పెన్షన్దారులు మాట్లాడుతూ.. తమకు కేసీఆర్ పింఛనే ఆసరా అని, తమకు పెద్ద కొడుకులా నెల నెల పింఛన్ ఇచ్చి మా బ్రతుకుకు భరోసాగా నిలుస్తుండని, మా వంతు కృషిగా కేసీఆర్, కేటీఆర్కు నామినేషన్ కోసం రూ.1000 చొప్పున విరాళం ఇస్తున్నామని తెలిపారు.
దీనికి సంబంధించిన ట్వీట్ను కేటీఆర్కు ట్యాగ్ చేయగా, ఆయన స్పందించారు. ఈ ట్వీట్ను కేటీఆర్ తన పేజీలో షేర్ చేస్తూ.. థాంక్యూ, రియల్లీ టచ్డ్ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
🙏 Thank You. Really touched ❤️ https://t.co/CF2zn9otXB
— KTR (@KTRBRS) August 28, 2023