KTR | కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. మోచేతికి బెల్లం పెట్టీ మోసపూరిత హామీలతో గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్, గాంధీచౌక్, తెలంగాణ చౌక్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించి.. కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. నేత కార్మికుల కోసం రూ.3వేలకోట్లు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నామన్నారు. ఐదేళ్లలో రూపాయి మందు పంచలేదని.. మీరు నాకు ఇచ్చిన దయ అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్లనేనన్నారు. సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చిదిద్దామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తాకులాట పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా? చెప్పాలరన్నారు. అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచలో ఒక్క నిమిషాల్లో దొరికిపోయారన్నారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చిందని.. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని పట్టుకొని కాంగ్రెస్ నేతలు అనేక మాటలు, బూతులు మాట్లాడుతుందంటూ మండిపడ్డారు. వందరోజుల్లో రైతు రుణమాఫీ, పింఛన్లు వచ్చాయా? అంటూ ప్రశ్నించారు. ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అంటూ విమర్శించారు. కేసీఆర్ మళ్లీ కావాలంటే మే 13 13న కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. అప్పుడే తెలంగాణలో శాసించే అధికారం వస్తుందన్నారు.
రాముడు అందరివాడని.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బీజేపీకి పుట్టకముందు నుండే ఉన్నాయన్నారు. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పనికి చేసిందా..? ఒక్క శిలాఫలకం వేయని వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. మోదీ ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి వసూలు చేశారని విమర్శించారు. మనకు ప్రధానమంత్రి కాదని.. పిరమైన ప్రధానమంత్రి అంటూ విమర్శించారు. అప్ కీ బార్ 420 అంటున్నారని.. అక్కరకు రాని సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.