నిర్మల్ : పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ముఖ్రా కే గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని ముఖ్రా కే గ్రామస్తులు బ్యానర్పై ప్రచురించారు. ఈ బ్యానర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ముఖ్రా కే గ్రామాన్ని ఇప్పటి వరకు రూ. 33 కోట్లతో అభివృద్ధి చేసి, దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపిన కేసీఆర్కు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉపసర్పంచ్ వర్షాతో పాటు గ్రామస్తులు తిరుపతి, సంజీవ్, పర్లాద్, మాధవ్ పాల్గొన్నారు.