ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తమ మనువడికి కేసీఆర్గా నామకరణం చేశారు. ముఖ్రా కే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిపిన కేసీఆర్కి సదా రుణపడి ఉంటామన్నారు. కేసీఆర్తోనే తమ గ్రామం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు.
ఆయన ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితోనే తమ గ్రామానికి జాతీయ స్థాయిలో 5 అవార్డులు వచ్చాయని తెలిపారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. అందుకే తమ పిల్లలు గాడ్గే వైష్ణవి-ధీరజ్కి జన్మించిన కొడుకుకు కేసీఆర్గా నామకరణం చేశామన్నారు. జన్మంతా కేసీఆర్ వెంటే ఉంటామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని గాడ్గే మీనాక్షి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.